ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కొడుకు కోడెల శివరాం,కూతురు పూనాటి విజయలక్ష్మిపై నరసరావు పేటలో కేసు నమోదయ్యింది. రావిపాడులో ఓ బిల్డింగ్ నిర్మాణంలో తన దగ్గర కోడెల శివకుమార్,ఆయన అనుచరులు బెదిరించి డబ్బులు వసూలు చేశాడని బిల్డర్ మల్లిఖార్జున రావు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గతంలో కొన్న ల్యాండ్ కు అన్యాయంగా తన దగ్గర డబ్బులు వసూలు చేశారంటూ పద్మావతి అనే మహిళ విజయలక్ష్మిపై రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.