హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదు

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదు

బషీర్ బాగ్, వెలుగు: హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి మాధవీలతపై బేగంబజార్ పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కేసు నమోదైంది. ఫస్ట్ లాన్సర్ ప్రాంతానికి చెందిన షేక్ ఇమ్రాన్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు బేగంబజార్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్పెక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. మాధవీలతను హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి ఓ వర్గానికి (ముస్లిం కమ్యూనిటీ) వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఇమ్రాన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ఈ నెల 17న రాత్రి శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా బేగంబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిద్దంబర్ బజార్ వద్ద ఓ మసీద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై బాణం వదులుతున్నట్లు వ్యవహరించి, ముస్లింల మనోభావాలను దెబ్బతీశారన్నారు. ఈ నెల 20న తమకు ఫిర్యాదు అందిందని, మాధవిలతపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని విజయ్ కుమార్ తెలిపారు.