ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్ వైద్యులు, మేనేజ్మెంట్ పై 304A సెక్షన్ కింద కేసు నమోదైంది. గత రెండు రోజుల క్రితం కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రవీందర్ అనే వ్యక్తి మృతి చెందిన ఘటనలో ఈ కేసు నమోదైంది. గత 13 రోజుల క్రితం హెర్నియా ఆపరేషన్ కోసం ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్ లో చేరిన రవీందర్ అనే వ్యక్తికి చిన్న సర్జరీ చేయాలని చెప్పి జాయిన్ చేసుకుని చివరికి చంపేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సర్జరీ సమయంలో మత్తుమందు డోస్ ఎక్కువ కావడంతో మత్తు మందు పడలేదని ఐసీయూలో వెంటిలేటర్ పై పెట్టాలని చెప్పి లక్షల రూపాయల డబ్బులు దండుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరికి చికిత్స పొందుతూ రవీందర్ మృతి చెందాడని, బాడీని తీసుకుని వెళ్ళాలని ఆస్పత్రి వర్గాలు చెప్పినట్లు మృతుని బంధువులు చెబుతున్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లనే రవీందర్ చనిపోయాడని ఆరోపిస్తూ కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆపరేషన్ చేసిన డాక్టర్ కృష్ణా చౌదరితో పాటు ఆస్పత్రి మేనేజ్మెంట్ పై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. కాగా నెల వ్యవధిలోనే ఇలాంటి ఘటన కామినేని ఆసుపత్రిలో జరగటం ఇది రెండోసారి కావడం గమనార్హం.
కామినేని హాస్పిటల్పై కేసు నమోదు
- హైదరాబాద్
- February 18, 2023
లేటెస్ట్
- పర్మిషన్ లేకుండా ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తే చర్యలు
- సీసీ కెమెరాల పనితీరును పరిశీలించిన కలెక్టర్
- మధుమేహ నియంత్రణకు ఇలా చేయండి..
- కాలుష్యాన్ని కట్టడి చేసే సరికొత్త పదార్థం
- త్వరగా అన్లోడ్ చేయించాలి : కలెక్టర్బెన్ షాలోమ్
- ఎఫ్సీఐలో శిక్షణకు ఏడుగురి ఎంపిక
- గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష
- నాసిరకం విత్తనాలు అమ్మే కంపెనీలపై చర్యలేవీ?
- గూగుల్కు పోటీగా చాట్ జీపీటీ సెర్చ్ ఇంజిన్
- ఆశ్రమ పాఠశాల వసతి గృహాన్ని తనిఖీ చేసిన ఐటీడీఏ పీవో
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు