ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ జిల్లాలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. చోరీకి పాల్పడి పారిపోతున్న దొంగలకు నల్లపిల్లి ఎదురుకావడంతో అపశకునంగా భావించి వెళ్లకుండా అగిపోయారు. ఈ టైమ్ లో పోలీసులు వారిని పట్టుకుని అరెస్ట్ చేశారు. ఝాన్సీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టుబడిన వ్యక్తులు మధ్యప్రదేశ్కు చెందిన వారని, దొంగతనాలు చేసేందుకు ఝాన్సీకి వచ్చారని తెలిపారు.
అరెస్టయిన వారి నుంచి పోలీసులు భారీగా నగదు, నగలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు దొంగలు మధ్యప్రదేశ్లోని దతియా జిల్లాకు చెందిన అమిత్ పాఠక్ సోను, సైనిక్, రాహుల్ సేన్గా గుర్తించారు. పోలీసుల విచారణలో నిందితులలో ఒకరు మాట్లాడుతూ.. తాము పారిపోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు పిల్లి తమ దారికి అడ్డంగా రావడంతో అక్కడే ఆగిపోయారని చెప్పారు.