3 గంటలుగా కొనసాగుతున్న వైఎస్ అవినాష్ రెడ్డి విచారణ

3 గంటలుగా కొనసాగుతున్న వైఎస్ అవినాష్ రెడ్డి విచారణ

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ విచారణ కొనసాగుతోంది. హైదరాబాద్ కోఠిలోని సీబీఐ కార్యాలయంలో మూడు గంటలుగా అధికారులు ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ ఆధ్వర్యంలో అవినాష్ కాల్ డేటా, బ్యాంకు ట్రాన్సక్షన్స్ పై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇదే కేసులో అరెస్టైన దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా సీబీఐ విచారణ జరుపుతోంది. సీబీఐ కార్యాలయానికి అవినాష్ రెడ్డి అనుచరులు భారీగా చేరుకుంటుండటంతో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు.