హోరాహోరీగా సీబీఎస్‌‌సీ నేషనల్‌‌ జిమ్నాస్టిక్స్‌‌ పోటీలు

హోరాహోరీగా  సీబీఎస్‌‌సీ నేషనల్‌‌ జిమ్నాస్టిక్స్‌‌ పోటీలు

హైదరాబాద్‌‌, వెలుగు: గాడియం స్కూల్‌‌లో జరుగుతున్న సీబీఎస్‌‌సీ నేషనల్ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌‌షిప్‌‌లో అండర్-14 బాయ్స్‌‌ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్, గర్ల్స్‌‌ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ కేటగిరీల్లో ఖేల్ గావ్ పబ్లిక్ స్కూల్‌‌కు చెందిన మహ్మద్ జైద్ అన్సారీ, రాజహన్స్ విద్యాలయకు చెందిన నీతి దోషి గోల్డ్ మెడల్స్‌‌ సొంతం చేసుకున్నారు.  మూడో రోజైన, సోమవారం జరిగిన పోటీల్లో  అన్సారీ 71.35 పాయింట్లు సాధించి చాంపియన్‌‌గా నిలిచాడు.  

అభిజ్ఞాన్‌‌ సింగ్‌‌ రెండో ప్లేస్‌‌తో సిల్వర్‌‌, సోహమ్‌‌ ఆత్రే మూడో ప్లేస్‌‌తో బ్రాంజ్‌‌ నెగ్గారు. గర్ల్స్‌‌  విభాగంలో నీతి 41.20 పాయింట్లతో స్వర్ణం సాధించింది. క్రిషా షాబ్ 38.50తో సిల్వర్‌‌ నెగ్గగా,  డయానా గ్రేస్ 37.85 పాయింట్లతో బ్రాంజ్‌‌ గెలిచింది.  బాయ్స్‌‌ టీమ్‌‌ ఈవెంట్‌‌లో అలహాబాద్‌‌లోని ఖేల్ గావ్ పబ్లిక్ స్కూల్,  గర్ల్స్‌‌లో  సెయింట్ మేరీస్ కాన్వెంట్ స్కూల్ (అజ్మీర్) చాంపియన్లుగా నిలిచాయి. మూడో రోజు మొత్తం 17 కేటగిరీల్లో పోటీలు నిర్వహించారు.