
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వల్ల చాలా మంది బతుకులు ఛిద్రమయ్యాయి. ఎంతో మంది చిన్నారులను మహమ్మారి అనాథలను చేసింది. ఒకే ఇంట్లో తల్లిదండ్రులు చనిపోవడంతో పిల్లలు అనాథలుగా మారిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి పిల్లలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. కొవిడ్ వల్ల పేరెంట్స్ ను కోల్పోయిన పిల్లలకు ఉచితంగా రూ.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ అందిస్తామని కేంద్రం ప్రకటించింది. 18 ఏళ్ల లోపు పిల్లలందరికీ ఇది వర్తిస్తుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ప్రైమ్ మినిస్టర్స్ సిటిజన్స్ అసిస్టెంట్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్ ఫండ్ (PM CARES) కింద ప్రీమియం డబ్బులు చెల్లిస్తామని ఠాకూర్ పేర్కొన్నారు.