న్యూఢిల్లీ : లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న పేద ప్రజలకు కేంద్రం అండగా నిలుస్తోంది. ఈ సమయంలో ఆకలితో ఇబ్బంది పడకుండా నిత్యావసరాల కొనుగోలుకు వారి డైరెక్ట్ గా నగదు సహాయం అందిస్తోంది. ఇందుకోసం పలు పథకాల కింద దాదాపు రూ. 30 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. పీఎం కిసాన్ పథకం ద్వారా దేశంలోని దాదాపు 7 కోట్ల మంది రైతులకు వారి బ్యాంక్ అకౌంట్ లో రూ. 2000 జమచేసింది. రూ. 13, 855 కోట్ల రూపాయలు వారికి అందజేసింది. జన్ ధన్ యోజన ఖాతా ఉన్న ప్రతి మహిళ అకౌంట్ లో రూ. 500 జమచేసింది. దాదాపు 20 కోట్ల మందికి ఈ ప్రయోజనం అందింది. నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రొగ్రాం ద్వారా 2.82 కోట్ల మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగుల ఖాతాలో డెరెక్ట్ గా రూ. 1000 జమ చేసింది. 2.16 కోట్ల మంది భవన నిర్మాణ కార్మికులకు రూ. 3066 కోట్ల నగదు సహాయం అందించింది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ప్రతి కుటుంబానికి 5 కిలోల ఆహార ధాన్యాలు ఉచితంగా అందించనుంది. ఉజ్వల స్కీమ్ కింద వచ్చే మూడు నెలల పాటు 8.3 కోట్ల మంది మహిళలకు ఉచితంగా సిలిండర్ అందజేయనున్నారు. కరోనా కారణంగా ఉపాధి లేని వారిని ఆదుకునేందుకు ఈ సహాయం అందిస్తున్నామని కేంద్రం తెలిపింది. ఇప్పటికే రూ. 1.75 లక్షల కోట్ల ప్యాకేజీని ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు కేంద్రం ప్రకటించింది.
కరోనా క్రైసెస్ లో ప్రజలకు అండగా కేంద్రం
- దేశం
- April 13, 2020
లేటెస్ట్
- హైదరాబాద్లో కుండపోత
- లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలుంటయ్
- రిగ్గింగ్ వీడియో వైరల్ కేసులో..మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రావణ్ అరెస్ట్
- టీఎస్ఐసెట్కు రికార్డ్ స్థాయి అప్లికేషన్లు
- 1984లో పారిపోయిన ఖైదీ..40 ఏండ్ల తర్వాత దొరికిండు
- మార్చురీ కంపును భరించలేక పోతున్నం
- వన్ పాయింట్ వన్ సొల్యూషన్స్ లాభం రూ. 6 కోట్లు
- ప్లాంటు నిర్మించిన దీసవాలా రబ్బర్ ఇండస్ట్రీస్
- మద్యం తాగేందుకు రూ.50 అడిగితే కొట్టి చంపారు
- మందుకొట్టిన గడ్డి తిని 80 గొర్రెలు మృతి
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్