హైదరాబాద్‌‌ను యూటీ చేసే ఆలోచన కేంద్రానికి లేదు

హైదరాబాద్‌‌ను యూటీ చేసే ఆలోచన కేంద్రానికి లేదు

న్యూఢిల్లీ: హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసే ఆలోచన మోడీ ప్రభుత్వానికి లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్‌‌తోపాటు మరికొన్ని చెన్నై, బెంగళూరు, లక్నో నగరాలను భవిష్యత్‌లో కేంద్రం యూటీగా మార్చేస్తుందని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ లోక్‌సభలో కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలకు స్పందనగా కిషన్ రెడ్డి పైవిధంగా సమాధానం ఇచ్చారు. అబద్ధాలు ప్రచారం చేయడం, వాస్తవాలను వక్రీకరించడం ఎంఐఎం, టీఆర్ఎస్‌ పార్టీలకు అలవాటుగా మారిందని మండిపడ్డారు. సమాధానం చెప్పేలోపే అసదుద్దీన్ పార్లమెంట్ నుంచి పారిపోయారని విమర్శించారు.