నన్ను ఆ కంపెనీ సీఈఓ రేప్ చేశాడు: కన్నడ హీరోయిన్ ఫిర్యాదు

నన్ను ఆ కంపెనీ సీఈఓ రేప్ చేశాడు: కన్నడ హీరోయిన్ ఫిర్యాదు

తనను ఓ ప్రైవేట్ కంపెనీ సీఈఓ రేప్ చేసి.. వీడియో తీసి బెదిరిస్తున్నాడంటూ.. కన్నడ సినీ పరిశ్రమకు చెందిన హీరోయిన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీడియో సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంటూ సదరు నటి జగ్జీవన్‌రావ్ నగర పోలీసులకు ఫిర్యాదుచేసింది. నాయండహళ్లికి చెందిన మోహిత్ అనే వ్యక్తి.. తనకు కాఫీడే లో పరిచయం అయ్యాడని తెలిపింది. అతను తనను కంపెనీ ప్రమోటర్ గా నియమించుకున్నట్లు.. గత ఏడాది జనవరి 15న గోవా తీసుకెళ్లి ఫొటో షూట్ చేసినట్లు తెలిపింది.

గత ఏడాది జూన్ 22న హీరోయిన్ బర్త్ డే సందర్భంగా మోహిత్.. ఆమె ఇంట్లోనే పార్టీ ఏర్పాటు చేశాడు. పార్టీ తర్వాత ఇద్దరూ కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చాడు. అది తాగిన నటిపై.. మోహిత్ అత్యాచారం చేసి, వీడియో తీశాడు. ఆ వీడియో చూపించి ఆమె నుంచి ఓసారి రూ. 11 లక్షలు, మరోసారి రూ. 9 లక్షలు వసూల్ చేశాడు. ప్రస్తుతం మళ్లీ బ్లాక్ మెయిల్ చేయడంతో ఆ నటి.. పోలీసులను ఆశ్రయించింది. నటి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు మోహిత్ మరియు అతని కుటుంబసభ్యుల కోసం వెతుకుతున్నారు.

For More News..

హైద్రాబాద్ టూ ఆదిలాబాద్.. బస్సులో ముగ్గురికి కరోనా

టిక్‌టాక్‌ బ్యాన్‌తో.. హైదరాబాద్ యాప్ కు జోష్

వీడియో: పానీ పూరీ కోసం ఏటీఎం