- అసీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి
హైదరాబాద్,వెలుగు : రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటనతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన ప్రెస్ నోట్ విడుదల చేశారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ
వెనకబడిన జిల్లాలకు ఆర్థికసాయం, గిరిజన వర్సిటీ అమలు చేయలేదని, రాష్ట్ర ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించలేదని, ప్రజలను మభ్యపెట్టి ఓట్లు ఆడగడానికి రెండు రోజులు పర్యటన చేశారని తెలిపారు.