హైదరాబాద్ కు చెడ్డీ గ్యాంగ్ మళ్లీ వచ్చింది . మియాపూర్ , హైటెక్ సిటీ పరిధిలోని నోవాటెల్ హోటల్కి సమీపంలో ఉన్న వసంత విల్లాస్ లో చెడ్డీ గ్యాంగ్ హల్ చల్ చేసింది. పలు కాలనీల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతోంది గ్యాంగ్. చెడ్డీలు వేసుకుని,తలకు ముసుగులతో చేతిలో మారణయుధాలతో చెడ్డి గ్యాంగ్ తిరుగుతోంది. తాళాలు వేసి ఉన్న ఇండ్లే టార్గెట్ చేసుకుని చోరీలు చేస్తున్నారు. చెడ్డీ గ్యాంగ్ చోరీలకు పాల్పడుతున్న వీడియోలు సీసీ కెమెరాల్లో వైరల్ గా మారాయి.
ఆగస్టు 7 రాత్రి మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వసంత్ ర్యాలీ 17వ విల్లాలో ఐదుగురు దుండగులు ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ఇంటి యాజమాని తాళం వేసి కామారెడ్డికి వెళ్లారు. బాత్రూం వెంటిలేషన్ అద్దాలు తొలగించి ఇంట్లోకి చొరబడ్డారు. సుమారు 30 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు చెడ్డీ గ్యాంగ్ కోసం గాలిస్తున్నారు.