పట్టపగలే రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు..

పట్టపగలే రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు..

శాంతి భద్రతలపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు నగర వాసులు. రోజుకో చోట చైన్ స్నాచింగ్ వంటి కేసులు నమోదవుతుండటంతో భయబ్రాంతులకు గురవుతున్నారు. 2024, ఏప్రిల్ 14 నాడు పట్టపగలే చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. వృద్ధిరాలి మెడలో నుంచి నాలుగు తులాల పుస్తెల తాడు ఎత్తుకెళ్లారు కేటుగాళ్లు. వివరాల్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని తుర్కయంజాల్ లో ఓ వృద్ధిరాలు ఇంటి బయట నిలబడి ఉన్న సమయంలో తన మెడలోని నాలుగు తులాల పుస్తెల తాడును దొంగలు ఎత్తుకెళ్లారు.

పట్టపగలే ఈ ఘటన జరగడంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామన్నారు.