చలసాని శ్రీనివాస్ కూతురు ఆత్మహత్య

చలసాని శ్రీనివాస్ కూతురు ఆత్మహత్య

ఆంధ్రమేధావుల ఫోరం  కన్వినర్ చలసాని శ్రీనివాస్ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆమె కూతురు ఇంటీరియర్ డిజైనర్ శిరిష్మ(27) ఆత్మహత్య గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుంది. ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు.  చలసాని శ్రీనివాస్ కూతురు శిరిష్మ వివాహం 2016 డిసెంబర్ లో సిద్దార్థ్ తో జరిగింది . భర్త తో కలిసి గచ్చిబౌలిలో నివాసం ఉంటున్నారు. సిద్దార్థ్ తన గ్రానైట్ బిజినెస్ ముగించుకొని ఇంటికి రాగానే అప్పటికే శిరిష్మ ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఉంది. వెంటనే సిద్దార్థ్ ఆమెను కిందకి దింపి హాస్పిటల్ కి తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్ లు తెలిపారు.  పెళ్లై  ఐదేళ్లయినా  పిల్లలు పుట్టలేదనే డిప్రేషకు లోనయ్యారు శిరిష్మ. ఆమె మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు పోలీసులు. చలసాని శ్రీనివాస్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.