రంగారెడ్డి, వెలుగు : రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ను ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మెయిన్ రోడ్ దగ్గరలోకి మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్కు గాంధీనగర్ ప్రాంతానికి చెందిన చంద్రసేనా రెడ్డి ఫిర్యాదు చేశాడు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కొంగరకలాన్ గ్రామంలో ఉండటంతో.. సామాన్యులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఫిర్యాదులో తెలిపాడు. ఉద్యోగులు కూడా సమయానికి వెళ్లలేకపోతున్నారని పేర్కొన్నాడు.
కనీసం రవాణా సౌకర్యం లేదని, సామాన్యులు కలెక్టరేట్కు పనిమీద వెళ్లాలంటే తిప్పలు పడాల్సి వస్తోందన్నాడు. మెయిన్ రోడ్ నుంచి కలెక్టరేట్ ఆఫీసుకు 5 కిలోమీటర్ల దూరం ఉందన్నాడు. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం సమీపంలోకి కలెక్టరేట్ ను తరలించాలని ఆయన కోరాడు.