ఇంటర్ పరీక్ష తేదీల్లో మార్పులు

ఇంటర్ పరీక్ష తేదీల్లో మార్పులు

ఇంటర్ పరీక్ష తేదీల్లో మార్పులు చేసింది ఇంటర్ బోర్డు. హుజురాబాద్ ఉప ఎన్నిక కారణంగా ఈ నెల 25 వ తేదీ నుండి జరుగనున్న ఇంటర్ పరీక్ష తేదీల్లో స్వల్ప మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 29,30 తేదీల్లో జరగాల్సిన పరీక్షలును రీషెడ్యూల్ చేశారు అధికారులు. 

ఈ నెల 29 వ తేదీన జరిగే పరీక్షను 31 వ తేదీకి, ఈ నెల 30 వ తేదీ న జరిగే పరీక్షను  నవంబర్ 1 వ తేదీకి రీషెడ్యూల్  చేశారు. 31వ తేదీ ఆదివారం అయినా పరిక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. 

కరోనా కారణంగా ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాయకుండానే  విద్యార్ధులను సెకండ్ ఇయర్ కు ప్రమోట్ చేశారు బోర్డు అధికారులు.  ప్రస్తుతం సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఈ నెల 25 నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే హుజురాబాద్ ఎన్నికల కారణంగా  ..29,30 తేదీల్లో జరగాల్సిన పరీక్షలను రీ షెడ్యుల్ చేస్తున్నట్లు ఇంటర్ బోర్డు అధికారులు ప్రకటించారు.