ఐదేళ్ల తర్వాత ‘అర్జున’ అందుకున్న పూజారా

ఐదేళ్ల తర్వాత ‘అర్జున’ అందుకున్న పూజారా

టీమిండియా టెస్ట్ బ్యాట్స్మన్ ఛటేశ్వర పూజారా ఐదేళ్ల తర్వాత అర్జున అవార్డు అందుకున్నాడు. యూనియన్ స్పోర్ట్స్ మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ చేతుల మీదుగా అర్జున అవార్డును స్వీకరించాడు. 2017లో కేంద్ర ప్రభుత్వం పూజారాకు అర్జున అవార్డును ప్రకటించింది. అయితే ఆ ఏడాది పూజారా అవార్డు వేడుకకు హాజరవలేదు. దీంతో ఐదేళ్ల తర్వాత అర్జున అవార్డును అందుకున్న పూజారా..ఈ ఫోటోను ట్విట్టర్​ లో పోస్ట్ చేశాడు. 

గర్వంగా ఉంది..

అర్జున అవార్డు అందుకోవడం గర్వంగా ఉందని పూజారా తెలిపాడు. ఆలస్యం అయినా కేంద్రం తనను సత్కరించి అవార్డు ప్రదానం చేసిందని చెప్పాడు. అర్జున అవార్డు అందించిన కేంద్ర ప్రభుత్వం, కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, బీసీసీఐకి పూజారా ధన్యవాదాలు తెలిపాడు. తీరిక లేని షెడ్యూల్ కారణంగా 2017లో అవార్డు అందుకోలేకపోయానన్నాడు.