
- 10 మంది నుంచి ఒక్కొక్కరి దగ్గర రూ. .60 వేలు వసూలు
పద్మారావునగర్,వెలుగు: బోయిన్పల్లి కేంద్రీయ విద్యాలయంలో అడ్మిషన్లు ఇప్పిస్తామని పది మంది నుంచి రూ.5.85 లక్షలు వసూలు చేసిన వ్యక్తిపై కేసు నమోదైంది. దమ్మాయిగూడలో నివాసముండే స్రవంతి తన ఇద్దరు పిల్లలకు అడ్మిషన్ కోసం బోయిన్పల్లిలోని కేంద్రీయ విద్యాలయానికి వెళ్లింది. స్కూల్ గేటు వద్ద అమిత్ కుమార్ అనే వ్యక్తి కలిసి కొంత ఖర్చు భరిస్తే అందులో సీటు ఇప్పిస్తానని నమ్మించాడు.
ఆమె డబ్బులు ఇవ్వడంతో పాటు ఇరుగుపొరుగు వారికి చెప్పింది. ఇలా ఒక్కొక్కరి నుంచి సుమారు రూ.60 వేలు మొత్తంగా రూ.5.85 లక్షలు తీసుకున్నాడు. నకిలీ అడ్మిషన్ పత్రాలు ఇచ్చాడు. ఈ నెల 18న స్కూల్కు పిల్లలను తీసుకెళ్లడంతో అసలు విషయం బయటపడింది. బాధితులు బోయిన్పల్లి పోలీసులను ఫిర్యాదు చేశారు.