ఎస్సీ వర్గీకరణ జోలికొస్తే ఊరుకోం: చెన్నయ్య

ఎస్సీ వర్గీకరణ జోలికొస్తే ఊరుకోం: చెన్నయ్య

హైదరాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణ జోలికి వస్తే ఊరుకోబోమని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య హెచ్చరించారు. శనివారం హైదరాబాద్​లోని వారి సంఘం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, ఆ తీర్పును గౌరవించకుండా కేంద్ర ప్రభుత్వం ఒక వర్గానికి వత్తాసు పలుకుతున్నదని మండిపడ్డారు.

వర్గీకరణపై తమ వైఖరి మార్చుకోని పార్టీలకు వచ్చే ఎన్నికల్లో మాలలు ఓటు ద్వారా గుణపాఠం చెప్తారన్నారు. పార్లమెంట్​లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశ పెట్టకుండా అన్ని రాష్ట్రాల ఎంపీలను కలిసి వినతిపత్రాలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నె శ్రీధర్​రావు తదితరులు పాల్గొన్నారు.