ఉద్యమకారుల పోరాటం వల్లే తెలంగాణ ఏర్పాటు:ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

ఉద్యమకారుల పోరాటం వల్లే తెలంగాణ ఏర్పాటు:ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్: ఉద్యమకారుల పోరాటం వల్లే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందన్నారు చెన్నూరు MLA వివేక్ వెంకట స్వామి. తాము ఎంపీలుగా ఉన్నప్పుడు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని చెప్పామన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న 300 మంది కుటుంబాలకు  ఒక్కొక్కరికి లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేశామన్నారు.

సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యమకారుల కృతజ్ఞత సభలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమకారులకు దక్కాల్సిన గౌరవం దక్కలేదన్నారు వివేక్. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమకారులను మోసం చేశారని ఆరోపించారు. 

తెలంగాణలో ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఉద్యమకారులకు 200 గజాల భూమి,ఉద్యమకారులకు 2 ఎకరాల్లో భవనం, పెన్షన్, బస్ పాస్ ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఉద్యమకారుల సంక్షేమ బోర్డ్ ఏర్పాటు కు కృషి చేస్తాను