
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. రైతు రుణమాఫీతో తెలంగాణ రైతాంగమంతా పండగు చేసుకుంటున్నారని చెప్పారు. వరంగల్ డిక్లరేషన్ లో రాహుల్ ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం రేవంత్ రెడ్డి రైతులకు రుణమాఫీ చేస్తున్నారన్నారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ ఆర్థిక పరిస్థితి దిగజారింది.. అయినప్పటికీ రైతుల సంక్షేమం కోసం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేస్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారని తెలిపారు.
చెన్నూరు నియోజకవర్గంలోనూ రైతులు సంబరాలు చేసుకుంటున్నారని తెలిపారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను వంచించారని తెలిపారు. కేసీఆర్ రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయకపోవడంతో అప్పుల పాలయ్యారన్నారు. తెలంగాణలో ఆర్థిక పరిస్థితి సరిగా లేకున్నప్పటికి రైతు సంక్షేమం కోసం రుణమాఫీ చేస్తున్నందుకు సిఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.