- చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్రెడ్డి
హైదరాబాద్, వెలుగు : తుక్కుగూడలో శనివారం నిర్వహిస్తున్న కాంగ్రెస్‘జనజాతర’ భారీ బహిరంగ సభను సక్సెస్చేయాలని చేవేళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన సభ జరిగే స్థలాన్ని, ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా రంజిత్రెడ్డి మాట్లాడుతూ.. తుక్కుగూడ సభ నుంచి కాంగ్రెస్ జంగ్ సైరన్ మోగించనుందన్నారు.
పార్టీ మేనిఫెస్టోను ఇదే సభలో విడుదల చేయాలని నిర్ణయించడం హర్షణీయమన్నారు. తెలంగాణలో 14 ఎంపీ స్థానాలు గెలుస్తామని, చేవెళ్లలో బంపర్ మెజారిటీ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
గ్రేటర్ నుంచి భారీగా తరలాలి : మోతే శ్రీలతారెడ్డి
కాంగ్రెస్‘జనజాతర’ సభకు గ్రేటర్సిటీ నుంచి పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని తెలంగాణ కార్మిక విభాగం అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డి, బల్దియా డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి పిలుపునిచ్చారు. సభలో పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తారన్నారు. కాంగ్రెస్అగ్రనేతలంతా వస్తున్నారని, తెలంగాణ గడ్డ నుంచే రాహుల్ గాంధీని పీఎం చేస్తామనే భరోసా కల్పించాలని చెప్పారు.