లింకు పై క్లిక్.. రూ 2 లక్షలు గోవిందా

లింకు పై క్లిక్.. రూ 2 లక్షలు గోవిందా

కూసుమంచి,వెలుగు : సెల్​లో మోసపూరిత ప్రకటన చూసి లింకు క్లిక్​చేయడంతో రూ,1.9లక్షలు పోగోట్టుకున్న ఘటన   మండలంలోని నాయకున్​గూడెం గ్రామంలో  జరిగింది. ఎస్ఐ రమేశ్​కుమార్​ తెలిపిన ప్రకారం చిలకబత్తిని వెంకటేశ్వర్లు ప్రవేటు ఉద్యోగం చేస్తున్నాడు. సెల్​లో ప్రకటన చూసి గుర్తు తెలియని లింక్​ను క్లిక్​ చేసి  టాస్క్ ను పూర్తి చేశాడు. ఆ లింక్​లో ఉన్న  సూచనలు పాటించి రూ,1.9 లక్షలు డిపాజిట్​ చేశాడు.

అయితే పనులు పూర్తి చేసినా డబ్బులు తిరిగి రాలేదు. దీంతో తాను మోసపోయానని  గ్రహించి సైబర్ క్రైమ్ పోర్టల్1930 డయల్ చేసి  వెంటనే ఫిర్యాదు చేశాడు. అతను చెల్లించిన అమౌంట్ లో నుంచి అకౌంట్లో రూ.59వేలు హోల్డ్ చేశామన్నారు. వెంకటేశ్వర్లు ఫిర్యాదుతో  కేసు నమోదు చేసుకుని  దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.