ముషీరాబాద్, వెలుగు: లారీ ఢీకొని చిన్నారి చనిపోయిన ఘటన నల్లకుంట పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తార్నాకలోని మాణికేశ్వర్నగర్లో ఉండే నదీమ్ కూతురు ఫాతిమా(8) అంబర్ పేటలోని ఓ మదర్సాలో చదువుతోంది. శనివారం ఉదయం నదీమ్ తన కూతురిని తీసుకొని బైక్పై స్కూల్ వద్దకు బయలుదేరాడు. అడిక్మెట్ ఫ్లై ఓవర్ వద్ద అతడి బైక్ను లారీ ఢీకొట్టింది.
ప్రమాదంలో ఫాతిమా కిందపడిపోగా.. ఆమెపై నుంచి లారీ వెళ్లింది. దీంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. నదీమ్కు స్వల్ప గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఫాతిమా డెడ్బాడీని గాంధీ హాస్పిటల్కు తరలించారు. కేసు ఫైల్ చేశారు. అయితే, యాక్సిడెంట్కు కారణమైన లారీ డ్రైవర్ ప్రమాదం జరిగిన తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడు నల్లకుంట పీఎస్లో లొంగిపోయినట్లు సమాచారం.