లారీ ఢీకొని చిన్నారి మృతి : నల్లకుంట పీఎస్ పరిధిలో ఘటన

లారీ ఢీకొని చిన్నారి మృతి : నల్లకుంట పీఎస్ పరిధిలో ఘటన

ముషీరాబాద్, వెలుగు: లారీ ఢీకొని చిన్నారి చనిపోయిన ఘటన నల్లకుంట పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తార్నాకలోని మాణికేశ్వర్​నగర్​లో ఉండే నదీమ్ కూతురు ఫాతిమా(8) అంబర్ పేటలోని ఓ మదర్సాలో చదువుతోంది. శనివారం ఉదయం నదీమ్ తన కూతురిని తీసుకొని బైక్​పై స్కూల్ వద్దకు బయలుదేరాడు. అడిక్​మెట్ ఫ్లై ఓవర్ వద్ద అతడి బైక్​ను లారీ ఢీకొట్టింది.

ప్రమాదంలో ఫాతిమా కిందపడిపోగా.. ఆమెపై నుంచి లారీ వెళ్లింది. దీంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. నదీమ్​కు స్వల్ప గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఫాతిమా డెడ్​బాడీని గాంధీ హాస్పిటల్​కు తరలించారు. కేసు ఫైల్ చేశారు. అయితే, యాక్సిడెంట్​కు కారణమైన లారీ డ్రైవర్ ప్రమాదం జరిగిన తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడు నల్లకుంట పీఎస్​లో లొంగిపోయినట్లు సమాచారం.