దంపతుల మృతితో అనాథలైన పిల్లలు

దంపతుల మృతితో అనాథలైన పిల్లలు
  •     న్యాయం చేయాలంటూ గ్రామస్తులు, బంధువుల ధర్నా

చేవెళ్ల, వెలుగు : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మల్లారెడ్డి గూడ గేటు సమీపంలో గురువారం సాయంత్రం కారు ఢీకొని బొబ్బిలి గ్రామానికి చెందిన దంపతులు గాయపడగా.. భార్య నవనీత స్పాట్ లో మృతిచెందగా.. భర్త మల్లయ్య(40) ఉస్మానియాలో చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయాడు.  

తల్లిదండ్రుల మృతితో పిల్లలు అనాథలు అయ్యారు. కూతురు మనస్వి, కొడుకు యశ్వంత్ తో కలిసి గ్రామస్తులు, బంధువులు న్యాయం చేయాలంటూ చేవెళ్ల పోలీస్ స్టేషన్ ముందు హైదరాబాద్ – బీజాపూర్ హై వేపై గంటపాటు ధర్నా చేయగా గంటపాటు ట్రాఫిక్ జామ్ అయింది. కారు ఓనర్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని రాజేంద్రనగర్ ఎస్ఓటీ ఏసీపీ రమణ గౌడ్ హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రదీప్ కుమార్ తెలిపారు.