
ఫేక్ పాస్ పోర్టుల కేసులో సీఐడీ దర్యాప్తు వేగవంతం చేసింది. ఫేక్ డాక్యుమెంట్స్ తో పాస్ పోర్టు జారీ చేసిన నిందితులలో ఆరుగురిని మరోసారి రెండు రోజులపాటు కస్టడీకి ఇవ్వడానికి కోర్టు అనుమతించింది. ఇందులో A1 అబ్దుల్ సత్తార్,A2 మహమ్మద్ కమురుద్దీన్.A6 పోచంపల్లి దేవరాజ్, A7,సుభాష్. A8 శ్రీనివాస్, A13 మురళి ఈ ఆరుగురిని రెండు రోజులపాటు సీఐడీ విచారించనుంది.
ఇప్పటికే ఈ కేసులో సీఐడీ 14 మంది నిందితులను అరెస్ట్ చేసింది. 12 మంది నిందితులను 5 రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారించింది. ఇపుడు మరోసారి ఆరుగురు నిందితులను రెండు రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించనుంది. ఫేక్ డాక్యుమెంట్లు పొందిన వారిలో ఎక్కువగా జగిత్యాల, హైదరాబాద్ అడ్రెస్ లు పెట్టినట్టు సీఐడీ అధికారులు గుర్తించారు.