న్యూఢిల్లీ : ఈ ఏడాది చివరి నాటికి మనదేశంలో సేల్స్ నెట్వర్క్ను 200కి పైగా ఔట్లెట్లకు పెంచాలని యోచిస్తున్నట్లు ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ సిత్రియాన్ గురువారం తెలిపింది. ప్రస్తుత టచ్ పాయింట్లలో మూడు రెట్ల పెరుగుదల ఉంటుందని పేర్కొంది. అర్బన్, సెమీ అర్బన్ గ్రామీణ మార్కెట్లలో కొత్త డీలర్షిప్లను తెరుస్తామని పేర్కొంది.
ప్రస్తుతం 58 ఔట్లెట్లు ఉన్నాయని తెలిపింది. టైర్ 1/టైర్ 2 నగరాల వెలుపల కూడా మా వాహనాలను అందుబాటులోకి తెస్తామని సిత్రియాన్ ఇండియా బ్రాండ్ డైరెక్టర్ శిశిర్ మిశ్రా తెలిపారు. భారతదేశంలో వ్యాపార విస్తరణకు రూ.2,000 కోట్ల అదనపు పెట్టుబడిని కంపెనీ ప్రకటించింది. సిత్రియాన్ దేశంలో సి3 ఎయిర్క్రాస్, సి5 ఎయిర్క్రాస్ వంటి మోడళ్లను విక్రయిస్తోంది.