ప్రభుత్వ హామీని నెరవేర్చాలని మల్లారెడ్డికి సీఐటీయూ వినతి

ప్రభుత్వ హామీని నెరవేర్చాలని మల్లారెడ్డికి సీఐటీయూ వినతి

మంత్రి మల్లారెడ్డిని సీఐటీయూ నేతలు కలిశారు. గత బడ్జెట్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని వినతిపత్రం అందజేశారు. గత బడ్జెట్ లో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఇచ్చిన హామీని నెరవేర్చలేదని కార్మికులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అయితే కార్మికుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని మల్లారెడ్డి హామీ ఇచ్చారు. అంతకుముందు మంత్రి మల్లారెడ్డి ఇంటి ముట్టడికి సీఐటీయూ నేతలు పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆయన ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.