ప్రజలను బీఆర్​ఎస్​ తప్పుదోవ పట్టిస్తున్నది : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

ప్రజలను బీఆర్​ఎస్​ తప్పుదోవ పట్టిస్తున్నది : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

ప్రజలను బీఆర్​ఎస్​ తప్పుదోవ పట్టిస్తున్నది

రైతులకు ఫ్రీ కరెంట్​ ఇవ్వడం కాంగ్రెస్​ పేటెంట్: భట్టి విక్రమార్క

హైదరాబాద్​, వెలుగు : ప్రజలను, రైతులను బీఆర్​ఎస్​ పార్టీ కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నదని, అది బీఆర్​ఎస్​కు వెన్నతో పెట్టిన విద్య అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. బీఆర్​ఎస్​ గోబెల్స్​ ప్రచారాన్ని రైతులు, ప్రజలు నమ్మొద్దని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. ‘‘ఉచిత కరెంట్​ గురించి ఎవరు ఆలోచన చేయని రోజుల్లోనే 2004లో కాంగ్రెస్​ ప్రభుత్వం ఉచిత కరెంట్​ ఇచ్చిన విషయం అందరికీ తెలుసు. రైతులకు ఉచిత కరెంటు ఇవ్వడం కాంగ్రెస్​ పేటెంట్​.  ఉమ్మడి రాష్ట్రంలో అరకొర నిధులు ఉన్న సమయంలోనే వ్యవసాయానికి ఉచిత కరెంట్​ ఇచ్చిన ఘనత కాంగ్రెస్​ ప్రభుత్వానిది”అని పేర్కొన్నారు.