రాష్ట్రంలో సీఎం కేసీఆర్ వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి సారించారని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. మిషన్ కాకతీయ, నిరంతర ఉచిత విద్యుత్ తో రాష్ట్రంలో వ్యవసాయంను పండుగలా చేశారని చెప్పారు. రూ.1000 కోట్లతో ధాన్యం నిల్వల కోసం రాష్ట్రం లో 534 గోదాములు నిర్మించామన్న ఆయన... రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధి కోసం రైతులకు అండగా పెట్టుబడి సాయం అందిస్తోందన్నారు. సకాలంలో ఎరువులను అందించి తెలంగాణ ప్రభుత్వం రైతులను అదుకున్నదని స్పష్టం చేశారు.
బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు జీవన్ రెడ్డి గారు రైతుల సమస్యలపై ఎందుకు మాట్లాడరు అని ప్రశ్నించారు. దేశంలో రోజురోజుకూ రూపాయి విలువ పడిపోతుందని చెప్పారు. కేసీఆర్ దార్శనికతతో రైతుల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తే... కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు.