ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కూతురు వివాహం హైదరాబాద్లో అట్టహాసంగా జరిగింది. పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. సీఎం కేసీఆర్, మంత్రి మహముద్ అలీ సహా పలువురు వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.
మరోవైపు సీఎం కేసీఆర్ను మంత్రి మహమూద్ అలీ దంపతులు కలిశారు. తన మనుమరాలు వివాహానికి రావాల్సిందిగా సీఎంను కోరారు.