రంజాన్ వేడుకల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్
హోంమంత్రి ఇంట్లో రంజాన్ వేడుకలకు సీఎం కేసీఆర్
హైదరాబాద్, వెలుగు: మినిస్టర్స్ క్వార్టర్స్లోని హోంమంత్రి మహమూద్ అలీ నివాసంలో నిర్వహించిన రంజాన్ వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. శనివారం మధ్యాహ్నం మినిస్టర్స్ క్వార్టర్స్కు చేరుకున్న కేసీఆర్కు మహమూద్ అలీ ఫ్యామిలీ మెంబర్స్ ఘనంగా స్వాగతం పలికారు. తర్వాత అక్కడే ఉన్న ముస్లిం పెద్దలను కేసీఆర్ పలకరించి రంజాన్ విషెస్ చెప్పారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి పార్టీలో ఉన్న సత్తార్గుల్షానీతో కేసీఆర్ మాట్లాడారు. మహమూద్ అలీ ఫ్యామిలీ ఇచ్చిన విందులో పాల్గొన్నారు. కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మేయర్ తదితరులు పాల్గొన్నారు.