ఢిల్లీకి బయల్దేరిన సీఎం కేసీఆర్

ఢిల్లీకి బయల్దేరిన సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ దంపతులు ఢిల్లీకి బయలుదేరారు. ప్రగతి భవన్ నుంచి బేగంపేట విమానాశ్రయంలో హెలికాప్టర్ లో పయనమయ్యారు. కేసీఆర్ నాలుగు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి BRS ఆఫీసులో రాజశ్యామల యాగం జరగనుంది. ఈ నెల 14న  'సర్దార్ పటేల్ మార్గంలో BRS పార్టీ ఆఫీసు ప్రారంభం కానుంది. 

బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత పార్టీ జాతీయ విధానం, జాతీయ కార్యవర్గం, కమిటీలపై కేసీఆర్ స్పష్టత ఇవ్వనున్నారు. ఈ క్రమంలో సీఎం భద్రత ఏర్పాట్లతో పాటు కార్యాలయం ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ పరిశీలిస్తున్నారు.