
హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ కరీంనగర్ పర్యటన వాయిదా పడింది. మూడు రోజుల కిందట ఇండోనేషియా నుంచి వచ్చిన ఎనిమిది మందికి కరోనా పాజిటివ్రావడంతో కరీంనగర్లో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీటిని స్వయంగా పర్యవేక్షించేందుకు, ప్రజలల్లో భరోసా నింపేందుకు సీఎం శుక్రవారం కరీంనగర్ వెళ్లాలనుకున్నారు. అయితే ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ఉండడంతో శనివారానికి వాయిదా వేసుకున్నారు. షెడ్యూల్ కూడా ఖరారైంది. కరీంనగర్లోనే ఉన్నతాధికారులతో సమావేశం కూడా ఫిక్స్ చేశారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పర్యటిస్తే స్క్రీనింగ్, వైద్య ఏర్పాట్లకు అసౌకర్యం కలుగుతుందనే అధికారుల సూచనల మేరకు పర్యటన వాయిదా వేసుకున్నారు.
For More News..