సీఎం కరీంనగర్ పర్యటన వాయిదా

సీఎం కరీంనగర్ పర్యటన వాయిదా

హైదరాబాద్​, వెలుగు: సీఎం కేసీఆర్ ​కరీంనగర్ ​పర్యటన వాయిదా పడింది. మూడు రోజుల కిందట ఇండోనేషియా నుంచి వచ్చిన ఎనిమిది మందికి కరోనా పాజిటివ్​రావడంతో కరీంనగర్​లో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీటిని స్వయంగా పర్యవేక్షించేందుకు, ప్రజలల్లో భరోసా నింపేందుకు సీఎం శుక్రవారం కరీంనగర్​ వెళ్లాలనుకున్నారు. అయితే ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్​ఉండడంతో శనివారానికి వాయిదా వేసుకున్నారు. షెడ్యూల్​ కూడా ఖరారైంది. కరీంనగర్​లోనే ఉన్నతాధికారులతో సమావేశం కూడా ఫిక్స్​ చేశారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పర్యటిస్తే స్క్రీనింగ్, వైద్య ఏర్పాట్లకు అసౌకర్యం కలుగుతుందనే అధికారుల సూచనల మేరకు పర్యటన వాయిదా వేసుకున్నారు.

For More News..

కరోనాపై విరుష్క జంట వీడియో సందేశం

కరోనాతో దేశాలు ఆగమాగం