తెలంగాణ రైతులకు ఆగస్ట్ 15వ తేదీ సందర్భంగా.. కేసీఆర్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. లక్ష రూపాయల లోపు ఉన్న రైతుల రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. సోమవారం (ఆగస్టు 14న) ఒకే రోజు 10 లక్షల 79 వేల 721 మంది రైతుల రూ.6 వేల 546 కోట్ల 5 లక్షల రుణాలను మాఫీ చేసింది.
ఇప్పటి వరకు 16.16 లక్షల మంది రైతులకు చెందిన రూ.7 వేల 753 కోట్ల రుణాలు మాఫీ అయ్యాయి. ఆగస్టు 2వ తేదీన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో రుణమాఫీపై నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్.. ఆగస్టు 3వ తేదీ నుంచి రైతుమాఫీని ప్రారంభించాలని ఆర్థికశాఖమంత్రి హరీశ్రావు, అధికారులను ఆదేశించారు.