దేశం అంధకారంలో ఉంటే తెలంగాణలో వెలుగులు జిలుగులు

దేశం అంధకారంలో ఉంటే తెలంగాణలో వెలుగులు జిలుగులు

రాష్ట్రంలో ప‌రిస్థితులు అద్భుతంగా వున్నా.. కేంద్రంలో మాత్రం ప‌రిస్థితులు బాగా లేవని సీఎం కేసీఆర్ అన్నారు. దానికి చికిత్స చేయాల్సిన అవ‌స‌రం మాత్రం ఉంద‌ని చెప్పారు. ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. కొన్నేళ్ల క్రితం వరకు తెలంగాణలో కనీసం తాగడానికి నీళ్లు లేని పరిస్థితి ఉండేదని.. అందరి సహకారంతో ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని అన్నారు. తెలంగాణ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని, దేశం మొత్తం నేడు అంధకారంలో ఉంటే రాష్ట్రం మాత్రం విద్యుత్ కాంతులతో విరాజిల్లుతోందని చెప్పారు. మైనార్టీ పిల్లల కోసం అద్భుతమైన రెసిడెన్షియల్ స్కూళ్లు నిర్మించి అన్ని వసతులు కల్పించామని, తెలంగాణ ప్రభుత్వం చేసినట్లే దేశం మొత్తం ఇదే విధానాన్ని అవలంబించాలని డిమాండ్ కేసీఆర్ చేశారు.