కోటి వృక్షార్చనలో రుద్రాక్ష మొక్క నాటిన కేసీఆర్

కోటి వృక్షార్చనలో రుద్రాక్ష మొక్క నాటిన కేసీఆర్

హైదరాబాద్: సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌‌లో భాగంగా చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా కొనసాగుతోంది. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రార్థన మేరకు సీఎం కేసీఆర్ స్వయంగా కోటి వృక్షార్చనలో పాల్గొని.. రుద్రాక్ష మొక్కను నాటారు. తన పుట్టిన రోజు సందర్భంగా చేపట్టిన ఈ కార్యక్రమంపై కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టిన సంతోష్ కుమార్‌‌ను అభినందించారు.