
రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్.సీఎం కేసీఆర్ గ్రామీణ పేదల పాలిట శాపంగా మారాడని రోపించారు. పేదవారి సొంతింటి కలను నిజం చేయాలనే లక్ష్యంతో గృహ నిర్మాణాలకు కేంద్రం రూ.200 కోట్లను కేటాయించిందన్నారు. కేసీఆర్ వాటిని ఖర్చుచేయకుండా ప్రజలకు అన్యాయం చేస్తున్నారని తెలిపారు. ప్రజలకు డబుల్ బెడ్రూం ఫ్లాట్లు అందిస్తామంటూ తప్పుడు మాటలు చెప్పిన కేసీఆర్.. 30 వేల ఇళ్లను ఎక్కడ కట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు అర్వింద్. ఆ ఇళ్లన్నీ ఆకాశంలో కట్టారా… ఫామ్హౌస్లో కట్టుకున్నారా అంటూ ప్రశ్నించారు. దేశంలోని ఏ రాష్ట్రలోనూ ఇంతటి దివాళా కోరు సీఎం లేరంటూ ఆరోపించారు ఎంపీ అర్వింద్.