ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్

ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. ఆయన రెండు మూడ్రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటారని సీఎంఓ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ తో పాటు ఆయన సతీమణి శోభ, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్ కుమార్, మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ వినోద్ ఢిల్లీకి వెళ్లారు. హస్తిన పర్యటనలో భాగంగా సీఎం పలువురు జాతీయ నేతలతో భేటీకానున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు కోసం ప్రాంతీయ పార్టీల లీడర్లతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన హస్తిన టూర్లో నేతలను కలుస్తారని వార్తలు వస్తున్నాయి.

For more news..

మార్చి 8న ముఖ్యమంత్రి వనపర్తి పర్యటన

కేసీఆర్‎కు మెంటల్ ఎక్కింది