ఉద్యోగులను కడుపుబ్బ నవ్వించిన సీఎం కేసీఆర్ పిట్టకథ

ఉద్యోగులను కడుపుబ్బ నవ్వించిన సీఎం కేసీఆర్ పిట్టకథ

సమ్మె తర్వాత విధుల్లోకి చేరిన ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్ జరిపిన సమావేశంలో సరదా సంభాషణ చేశారు, ప్రతి పని చేసేటప్పుడు చెడగొట్టేవాళ్ళు ఉంటారని చెబుతూ సీఎం రామాయణ యుద్ధం గురించి ప్రస్తావించి ఉద్యోగులను కడుపుబ్బ నవ్వించారు. యుద్ధంలో రామబాణం వల్ల అర్ధాయుష్షుతో మరణించిన రాక్షసులు కొందరు తమ పరిస్థితి ఏమిటని రాముణ్ణి అడిగినప్పుడు కలియుగంలో మీరు అక్కడక్కడా పుట్టండి అంటారు. అలా పుట్టిన వారే మనుషులను పీక్కుతింటున్నారని,  వారే ఆర్టీసీలో అందరినీ ఇబ్బంది పెడుతున్నరు అంటూ ముఖ్యమంత్రి పేర్కొనడంతో సమావేశంలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి.

Related News:  సీఎం ప్రసంగం.. ఆర్టీసీ కార్మికుల ఆనంద భాష్పాలు

భోజన సమయంలో కార్మికుల కష్ట సుఖాలు తెలుసుకున్న సీఎం

ప్రగతి భవన్ లో ఆర్టీసీ ఉద్యోగులతో భోజనం చేసే సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ డ్రైవర్లు , కండక్టర్ల తో ఆత్మీయంగా మాట్లాడి వారి కష్ట సుఖాలను తెలుసుకున్నారు . సీఎం చాలా ఆప్యాయంగా పలకరించడంతో మహిళా కండక్టర్లు తమ సమస్యలను వివరించారు. సీఎం కు ఎంతో చొరవగా తమ కష్ట సుఖాలను చెప్పుకున్నారు.