అమరవీరుల స్థూపానికి సీఎం కేసీఆర్ నివాళి

అమరవీరుల స్థూపానికి సీఎం కేసీఆర్ నివాళి

హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా అవతరణోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. ఆ తర్వాత నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లోని సెంట్రల్ లాన్స్ దగ్గర జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించనున్నారు సీఎం కేసీఆర్. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల ప్రముఖులు, రైతు సమన్వయ సమితి సభ్యులు, పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొననున్నారు.

జిల్లాల్లో స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మండలి డిప్యూటీ చైర్మన్, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, విప్ లు, జెడ్పీ చైర్ పర్సన్లు జాతీయ జెండాను ఎగురవేస్తారు. మరోవైపు అవతరణోత్సవాల సందర్భంగా హైదరాబాద్ లోని జూబ్లీహాల్, రవీంద్రభారతి, కళాభవన్ లో కవిసమ్మేళనం, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.