రాష్ట్రపతికి స్వాగతం పలికిన కేసీఆర్, గవర్నర్

రాష్ట్రపతికి స్వాగతం పలికిన కేసీఆర్, గవర్నర్

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ స్వాగతం పలికారు. కేసీఆర్ తో పాటు  సీఎస్ సోమేశ్ కుమార్, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి,మండలి మాజీ ఛైర్మన్ గుత్తాసుఖేందర్ రెడ్డి  ఉన్నారు. హకీంపేట్ ఎయిర్ బేస్ నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. కాసేపటి తర్వాత బొల్లారంలోని వార్ మెమోరియల్లో నివాళులు అర్పిస్తారు. రాత్రి రాజ్ భవన్లో గవర్నర్ ఏర్పాటు చేసిన డిన్నర్కు హాజరవుతారు. 

ప్రధాని మోడీ రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా కేసీఆర్ స్వాగతం పలకడం లేదు. దీనిపై పెద్దఎత్తున విమర్శలు సైతం వెల్లువెత్తాయి. అయితే రాష్ట్రపతికి కూడా సీఎ కేసీఆర్ స్వాగతం పలుకుతాడా లేదా అనే సందేహాలు నెలకొన్నాయి. అయితే కేసీఆర్ ముర్ముకు స్వాగతం పలకడం ఆసక్తికరంగా మారింది.