సౌర గిరి జల వికాసానికి శ్రీకారం.. రైతులకు సోలార్ పంపు సెట్లు

సౌర గిరి జల వికాసానికి శ్రీకారం.. రైతులకు సోలార్ పంపు సెట్లు

నాగర్​కర్నూల్​ జిల్లా అమ్రాబాద్​ మండలం మాచారం గ్రామంలో సౌర విద్యుత్​ ద్వారా నీరందించే  ఇందిర సౌర గిరి జల వికాసం పథకాన్ని  సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.  సీఎంతో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, దామోదర రాజనరసింహ, ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, శ్రీధర్​ బాబు, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్​రావు, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ, ఎంపీ మల్లు రవితో పాటు ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 ఆదివాసీ, చెంచు, గిరిజనుల సాగుభూమికి సాగునీటి వసతి కల్పించి అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.12,600 కోట్లతో ఐదేండ్ల పాటు ఈ పథకాన్ని అమలు చేయనుంది ఐదేండ్లలో రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల ఎకరాలను అభివృద్ధి చేయడం ద్వారా 2.10 లక్షల గిరిజన ఫ్యామిలీలకు లబ్ది చేకూరనుంది. మాచారం గ్రామంలో ఎంపిక చేసిన 26 మంది చెంచుల భూముల్లో బోర్లు తవ్వించి, సోలార్​ ప్యానెల్స్,​ మోటార్లు, పైప్​లైన్లు ఏర్పాటు చేశారు. ఉద్యానవన శాఖ అధికారులు పండ్ల మొక్కలు నాటారు. తోటల మధ్యలో అంతర్గతంగా ఆరుతడి పంటలు సాగుకు అనువుగా పైప్​లైన్లు ఏర్పాటు చేశారు.

Also Read : దేశానికే అచ్చంపేటను ఆదర్శంగా మారుస్తా

మాచారంలో అధికారిక కార్యక్రమాల అనంతరం సీఎం స్వగ్రామమైన కొండారెడ్డిపల్లి గ్రామానికి వెళ్తారు. సీఎం కుటుంబ సభ్యులు సొంత డబ్బులతో నిర్మించిన ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. అనంతరం తిరిగి హైదరాబాద్​ బయలుదేరుతారు. జిల్లాలో సీఎం పర్యటన సందర్భంగా అధికారులు మాచారం, కొండారెడ్డిపల్లిలో అన్ని ఏర్పాట్లు చేశారు.