
బీఆర్ఎస్ చేసిన విధ్వంసం వందేళ్లు కోలుకోలేనిదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వాళ్లు చేసిన తప్పులు సరి చేయడానికి రోజుకు 18 గంటలు పనిచేస్తున్నామని చెప్పారు రేవంత్. రైతులను కాదనుకున్న వారు అధికారంలోకి రాలేరని చెప్పారు. రైతుల ఆశీర్వాదం ఉంటేనే పాలకుల కుర్చీలు పదిలంగా ఉంటాయన్నారు. సర్పంచ్ నుంచి సీఎం వరకు ఏ పదవి రావాలన్నా రైతులకు అండగా నిలవాల్సిందేనని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యంలో రైతులే రాజులని అన్నారు.
18 నెలలుగా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వీధి నాటకాలు ఆడుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ వడ్డీలకే సరిపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది. బీఆర్ఎస్ చేసిన విధ్వంసం వందేల్లు కోలుకోలేనిది. రైతు రుణమాఫీపై మాట నిలబెట్టుకున్నాం.గత పాలకులు వరి వేస్తే ఉరి అన్నారు. మేం వడ్లు పండించిన రైతులకు 500 బోనస్ ఇస్తున్నాం.రైతును రాజును చేయడమే కాదు..వ్యవసాయాన్ని పండుగ చేస్తామన్నారు రేవంత్.
ALSO READ | రైతులకు గుడ్ న్యూస్ : రేపటి నుంచి (జూన్ 17) రైతు భరోసా డబ్బులు
రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఇస్తున్నాం. మద్దతు ధరతో ధాన్యం కొంటున్నాం. సన్న వడ్లతో పేదల కడుపు నింపుతున్నాం. దేశంలో వరి పండించడంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. సర్పంచ్ లకు గత ప్రభుత్వమే బకాయి పడింది. గత ప్రభుత్వ బకాయిలు చెల్లిస్తున్నాం . రైతుల కోసం ఇప్పటి వరకు లక్ష కోట్లు ఖర్చు చేశామని చెప్పారు రేవంత్.
సీఎం రేవంత్ రెడ్డి రైతు నేస్తం ప్రోగ్రామ్ ను ప్రారంభించారు. రాజేంద్రనగర్ లోని అగ్రి వర్శిటీలో 1034 రైతు వేదికల నుంచి రేవంత్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతు భరోసా,రుణమాఫీ, రైతుల సమస్యలు,సన్నవడ్ల బోనస్ పై రైతులను అడిగి తెలుసుకున్నారు . ఈ సందర్బంగా సన్న బియ్యం,రైతు భరోసా,బోనస్ పై ఆనందం వ్యక్తం చేశారు.