కేశవరావు నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి

 కేశవరావు నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ కె కేశవరావు మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం రాత్రి బంజారాహిల్స్ లోని ఆయన నివాసానికి వెళ్లి కలిశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా సీఎంకు కేశవరావు పుష్పగుచ్ఛం అందించి సన్మానించారు. సీఎం రేవంత్ రెడ్డితోపాటు పార్టీ ఇంచార్జీ దీప దాస్ మున్షీ, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ, రాజ్యసభ సభ్యులు రేణుకా చౌదరి, అనిల్ యాదవ్, జానారెడ్డి, ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, వివేక్, ఇతర నేతలు కె కేశవరావును కలిశారు. అనంతరం ఆయన నివాసంలోనే అందరూ డిన్నర్ చేశారు. 

కాగా, ఈరోజు ఉదయం దీపదాస్ మున్షీ, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కేకే కూతురు, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాను కాంగ్రెస్ లో చేరబోతున్నానని ఇప్పటికే కేశవరావు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒకటి రెండు రోజుల్లో ఆయన హస్తం గూటికి చేరుకోనున్నారు.