- పెండింగ్ డీఏలు, 317 జీవో సవరణ, పీఆర్సీపై చర్చ
హైదరాబాద్, వెలుగు: ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం సమావేశం కానున్నారు. ఈ మేరకు సీఎంవో నుంచి టీఎన్జీవో, టీజీవోలతో పాటు గుర్తింపు పొందిన టీచర్ల సంఘాల్లోని నేతలకు ఫోన్లు వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ మీటింగ్ లో ప్రధానంగా పెండింగ్ లో ఉన్న 4 డీఏలు, 317 జీవో సవరణ, ఉద్యోగుల హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్ ), ఉద్యోగుల మెడికల్ బిల్స్, సీపీఎస్ రద్దు, ఉద్యోగుల సాధారణ బదిలీలు, పీఆర్సీ, జోనల్ వ్యవస్థ వంటి అంశాలపై చర్చ జరగనుందని టీఎన్జీవో, టీజీవో నేతలు తెలిపారు. వచ్చే వారంలో లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ రానున్న నేపథ్యంలో కేబినెట్ మీటింగ్ లో పెండింగ్ డీఏలను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.