
రాష్ట్రంలో ప్రతి ఒక్కరి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. వైద్యారోగ్యశాఖపై సమీక్షించిన ముఖ్యమంత్రి..పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ఉంటే.. అత్యవసర పరిస్థితుల్లో సరైన వైద్యం అందించొచ్చని చెప్పారు. హెల్త్ ఫ్రొఫైల్ ను ఆరోగ్యశ్రీతో అనుసంధానించాలని సూచించారు. ఇటు ఆరోగ్యశ్రీ బిల్లులు కూడా గవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
మెడికల్ కాలేజీ ఉన్న ప్రతి చోట.. నర్సింగ్, పారా మెడికల్ కాలేజీలు ఉండేలా కామన్ పాలసీ తీసుకురావాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ హాస్పిటల్స్ లో హౌజ్ కీపింగ్ మెయింటైన్స్ రెస్పాన్సిబులిటీ బాధ్యత పెద్ద ఫార్మా కంపెనీలకు అప్పగించాలన్నారు. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులను ఏదో ఒక దానిని పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మూడునెలకోసారి ప్రైవేట్ హాస్పిటల్స్ కు ఆరోగ్య శ్రీ బిల్లులు విడుదల చేయాలన్నారు.