ఇరిగేషన్​లో అవినీతిపై శ్వేత పత్రం రిలీజ్ చేస్తం: సీఎం రేవంత్

ఇరిగేషన్​లో అవినీతిపై శ్వేత పత్రం రిలీజ్ చేస్తం: సీఎం రేవంత్
  •     అధికారం కోల్పోయిన వాళ్లు చెప్పింది నమ్మొద్దు
  •     యువత భవిష్యత్తుకు మాది గ్యారంటీ
  •     అభివృద్ధిలో తెలంగాణను అగ్రభాగాన నిలుపుతం
  •     రాష్ట్ర ప్రజలకు న్యూ ఇయర్ విషెస్ చెప్పిన సీఎం

హైదరాబాద్, వెలుగు: సాగు నీటి రంగంలో జరిగిన అవినీతిపై కూడా త్వరలో శ్వేత పత్రం విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆరు గ్యారంటీల్లో రెండు అమలు చేస్తున్నామని తెలిపారు. మిగిలిన నాలుగు గ్యారంటీల అమలుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. 2024ను ‘రైతు మహిళా యువత నామ సంవత్సరం’గా సంకల్పం తీసుకున్నామని తెలిపారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ, పౌరులకు స్వేచ్ఛ ఉంటుందన్న హామీ నిలబెట్టుకున్నామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ స్కీమ్​లు వర్తింపజేస్తామని, అభివృద్ధిలో రాష్ట్రం అగ్రభాగాన ఉండాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష అని తెలిపారు. న్యూ ఇయర్ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సందేశం ఇచ్చారు. ‘‘తెలంగాణ ప్రజలందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మీ అందరి సహకారంతో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. పాలనా వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నాం. ప్రజా పాలనకు అనుగుణంగా అన్ని రంగాల పునర్ వ్యవస్థీకరణ జరుగుతున్నది. ప్రజల గోడు వినేందుకు ప్రజా భవన్ లో ప్రజావాణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అధికారం కోల్పోయిన కొందరు ఈర్ష్యతో చేసే తప్పుడు ప్రచారాలు, అసత్య ప్రకటనలు నమ్మొద్దు’’అని రేవంత్ సూచించారు. 

ప్రతి ఒక్కరి ఆకాంక్షలు నెరవేరాలి

‘‘కాంగ్రెస్​ది జన పాలన. ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వాన్ని చేరుకునేందుకు 24 గంటలు ద్వారాలు తెరిచే ఉంటాయి. కవి దాశరథి కలం నుండి జాలువారిన విధంగా ‘‘నా తెలంగాణ కోటి రతనాల వీణగా..” కోట్లాది ప్రజల సంక్షేమ వాణిగా... అభివృద్ధిలో శిఖరాగ్రాన నిలవాలని ఆకాంక్షిస్తున్నాను. కొత్త ఏడాదిలో ప్రతి ఒక్కరి ఆకాంక్షలు నెరవేరాలని కోరుకుంటున్నాను. తెలంగాణలోని ప్రతి గడపలో సౌభాగ్యం వెల్లివిరియాలి. ప్రతి ఇంటా వెలుగులు నిండాలని మనసారా కోరుకుంటున్నాను. అందరికీ మరొక సారి హ్యాపీ న్యూఇయర్’’అని సీఎం రేవంత్ సందేశం ఇచ్చారు.

ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నం

యువత భవిష్యత్తు తమకు ఎంతో ముఖ్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని యువతకు అందించి.. వారి భవిష్యత్ కు గ్యారెంటీ ఇచ్చే దిశగా ఆలోచన చేస్తున్నామని తెలిపారు. ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రైతుల విషయంలో ఇచ్చిన ప్రతి మాటకూ కట్టుబడి ఉన్నామని తెలిపారు. ‘‘గత ప్రభుత్వం కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైంది. దాన్ని పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. ఆర్థిక, విద్యుత్ రంగాల్లో వాస్తవ పరిస్థితులను శ్వేత పత్రాల రూపంలో మీ ముందు ఉంచాం. త్వరలో సాగునీటి రంగంలో జరిగిన అవినీతిపై కూడా శ్వేత పత్రం విడుదల చేస్తాం’’అని రేవంత్ ప్రకటించారు. 

అవినీతిపై చర్యలు తీసుకుంటం

బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జరిగిన అవినీతి పై చర్యలు తీసుకుంటామని, దోపిడీకి గురైన తెలం గాణ ప్రజల సంపదను తిరిగి రాబడ్తామని సీఎం రే వంత్ అన్నారు. ఆ దిశగా చర్యలు మొదలు పెట్టామని తెలిపారు. పింఛన్లు, రేషన్ కార్డులు, ఇండ్ల కోసం లక్షలాది మంది అర్హులు ఎదురు చూస్తున్నారన్నారు. త్వరలో వారి ఆశలు ఫలిస్తాయని తెలిపారు. అమరులు, ఉద్యమకారుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఉద్యమకారులపై నమోదైన కేసుల వివరాలు సేకరిస్తున్నామని, ఆ కేసుల నుండి విము క్తి కల్పించే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉం దని తెలిపారు. ఆటో కార్మికులు, అసంఘటిత కార్మి కుల సంక్షేమం కోసం రూ.5 లక్షల బీమా సౌకర్యాన్ని తీసుకొచ్చామన్నారు. జర్నలిస్టుల సంక్షేమం ప ట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, వాళ్ల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని రేవంత్ అన్నారు.