తెలంగాణ ఆవిర్భావ వేడుకల్ని అన్ని జిల్లాల్లో ఘనంగా నిర్వహించాలి: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ఆవిర్భావ వేడుకల్ని అన్ని జిల్లాల్లో ఘనంగా నిర్వహించాలి: సీఎం రేవంత్ రెడ్డి

 జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో  ఘనంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను  ఆదేశించారు. మంత్రులు,కలెక్టర్లు,అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన రేవంత్ . ఈ సారి15 రోజుల ముందే రుతుపవనాలు వచ్చాయన్నారు.  ఇప్పటివరకు 90 శాతం ధాన్యం సేకరణ పూర్తయింది, ఈ సందర్భంగా అధికారులు, కలెక్టర్లను అభినందిస్తున్నానని  రేవంత్ రెడ్డి అన్నారు. చేసిన మంచి పనిని చెప్పుకోకపోవడం వల్లే చిన్న సంఘటనలు ప్రచారంలోకి వస్తున్నాయన్నారు రేవంత్. కొన్నిచోట్ల రాజకీయ ప్రేరేపిత సంఘటనలు జరుగుతున్నాయన్నారు. అనారోగ్యంతో రైతు చనిపోతే ధాన్యం కొనుగోలు వల్లనే అని దుష్ప్రచారం చేశారన్నారు. కలెక్టర్లు ప్రోయాక్టివ్ గా క్షేత్రస్థాయిలో పర్యటించాలని అన్నారు.

గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సారి 64.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం   కొనుగోలు చేశామని సీఎం రేవంత్ తెలిపారు. రుతుపవనాలు ముందే రావడంతో కొనుగోలల్లపై ప్రభావం పడిందన్నారు. వర్షాకాలం ముందే రావడంతో  రైతులకు విత్తనాలు అందుబాటులో ఉంచాలని అధికారులు,జిల్లా కలెక్టర్లకు  ఆదేశాలు జారీ చేశారు. నకిలీ విత్తనాలు అమ్మే వారిపై పీడీ యాక్ట్ కేసు పెట్టాలని చెప్పారు. జూన్ 3 నుంచి 20 వరకు మూడో దశ రెవెన్యూ సదస్సులు నిర్వహించాలన్నారు సీఎం ఇందిరమ్మ ఇల్లు పంపిణీ చాలా కీలకమన్నారు రేవంత్. ఈ నెల 29,30న అన్ని జిల్లాల్లో ఇన్ ఛార్జ్ మంత్రులు పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. జూన్ 1 వరకు పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు రేవంత్.