ఇవాళ బైరామల్​గూడ ఫ్లై ఓవర్ ఓపెన్

ఇవాళ బైరామల్​గూడ ఫ్లై ఓవర్ ఓపెన్

హైదరాబాద్, వెలుగు :  సిటీవాసులకు మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. ఎస్ఆర్డీపీలో భాగంగా ఎల్ బీ నగర్ ఏరియాలో నిర్మించిన ప్రాజెక్టులకు రూ.448 కోట్లు, భూసేకరణ రూ. 210 కోట్లు మొత్తం రూ.658 కోట్ల ఖర్చుతో నాలుగు జంక్షన్లలో మల్టీలెవల్ గ్రేడ్ సెపరేటర్ల నిర్మాణం చేపట్టినది తెలిసిందే.

 ఇందులో భాగంగా రూ.148.05 కోట్లతో బైరామల్ గూడ జంక్షన్ నిర్మించిన 2వ ఫ్లైఓవర్ ని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి శనివారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభించనున్నారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరగనున్న ప్రారంభోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొనున్నారు.